ఓటుకు నోటు కేసు మార్చి 1కి వాయిదా

ABN , First Publish Date - 2021-02-25T08:37:44+05:30 IST

ఓటుకు నోటు కేసు తదుపరి విచారణను ఏసీబీ ప్రత్యేక కోర్టు మార్చి 1కి వాయిదా వేసింది.

ఓటుకు నోటు కేసు మార్చి 1కి వాయిదా

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసు తదుపరి విచారణను ఏసీబీ ప్రత్యేక కోర్టు మార్చి 1కి వాయిదా వేసింది. ఎంపీ రేవంత్‌ రెడ్డి, రుద్ర ఉదయ్‌సింహా, సెబాస్టియన్‌ బుధవారం ఏసీబీ కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఆడియో టేపులకు సంబంధించి ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (ఎఫ్‌ఎ్‌సఎల్‌) నివేదిక అందాల్సి ఉందని, ఆ నివేదిక సమర్పించేందుకు కొంత గడువు కావాలని ఏసీబీ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. కేసు తదుపరి విచారణను న్యాయమూర్తి మార్చి 1కి వాయిదా వేశారు.  

Updated Date - 2021-02-25T08:37:44+05:30 IST