ఓటు శక్తి చాలా బలమైంది: తరుణ్ చుగ్

ABN , First Publish Date - 2021-01-18T01:37:00+05:30 IST

టీఆర్ఎస్ ప్రభుత్వ కుట్రలపై పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్దం కావాలని రాష్ట్ర బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ పిలుపునిచ్చారు.

ఓటు శక్తి చాలా బలమైంది: తరుణ్ చుగ్

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ కుట్రలపై పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్దం కావాలని రాష్ట్ర బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ పిలుపునిచ్చారు. నగరంలో బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తరుణ్ చుగ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై సామన్యుడు ఆక్రోశంగా ఉన్నాడని, అందువల్ల  బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కుటుంబ పాల‌న, లూటీ చేయటమే.. బంగారు తెలంగాణ? అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజల జేబులు లూటీ చేస్తోందని ఆరోపించారు. కుటుంబం పాలన కోసమే తెలంగాణ వచ్చిందా? అని తరుణ్ చుగ్ ప్రశ్నించారు. సచివాలయానికి రాని ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ ఎలా నిర్మిస్తారని ఆయన నిలదీశారు. ఓటు శక్తి చాలా బలమైందని, ఆ బలంతో అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేస్తున్నామని తరుణ్ చుగ్ చెప్పారు. 

Updated Date - 2021-01-18T01:37:00+05:30 IST