34వ రోజుకు వీఆర్ఏల సమ్మె
ABN , First Publish Date - 2022-08-28T05:44:50+05:30 IST
సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారానికి 34వ రోజుకు చేరుకుంది.
ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 27: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారానికి 34వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమ్మె చేస్తున్నా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, భాస్కర్, కృష్ణ, మంజుల తదితరులు పాల్గొన్నారు.