వృక్షాసనంతో ఏకాగ్రత
ABN , First Publish Date - 2020-06-15T05:30:00+05:30 IST
ఈ ఆసనం చెట్టు ఆకారాన్ని తలపిస్తుంది. అందుకే ‘వృక్షాసనం’ అంటారు. ఈ ఆసనం రోజూ వేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. తొడకండరాలు బలోపేతం...
ఈ ఆసనం చెట్టు ఆకారాన్ని తలపిస్తుంది. అందుకే ‘వృక్షాసనం’ అంటారు. ఈ ఆసనం రోజూ వేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. తొడకండరాలు బలోపేతం అవుతాయి.
ఎలా వేయాలంటే...
- ముందుగా నిల్చొని కాళ్లు, చేతులు నిటారుగా ఉంచాలి.
- ఇప్పుడు కుడి కాలును కొద్దిగా పైకి లేపి, ఎడమ కాలు తొడ మీద పెట్టాలి.
- రెండు అరచేతులూ కలిపి నమస్కారం పెడుతూ చేతులను తలమీదుగా పైకి లేపాలి. ఈ పొజిషన్లో కనీసం 30 సెకన్ల పాటు ఉండాలి.
- తిరిగి నెమ్మదిగా చేతులు కిందకు తీసుకురావాలి. కుడికాలును యథాస్థానానికి తీసుకురావాలి.
- తరువాత అదే పద్ధతిలో ఎడమ కాలుతో చేయాలి.
- ప్రారంభంలో ఒంటి కాలిపై నిలబడటం కష్టమవుతుంది. అలాంటప్పుడు గోడను ఆసరాగా చేసుకొని నిల్చొని చేయవచ్చు.