ఓ దివ్యాంగ వృద్ధుడికి వీఆర్వో బాసట

ABN , First Publish Date - 2021-05-17T04:49:39+05:30 IST

కాశీబుగ్గలోని ఓ వీధిలో దివ్యాంగ వృద్ధుడికి ఆదివారం కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈమేరకు రెవెన్యూ, వైద్యఆరోగ్య శాఖ అధికా రులు అతడికి సమాచారమిచ్చారు. వీఆర్వో షేక్‌ జాబేరు బాధితుడ్ని పరామ ర్శించారు. కుటుంబసభ్యులెవరూ అందు బాటులో లేక పోవడంతో ధైర్యం చెప్పా రు. పరిస్థితి విషమంగా ఉండడంతో పలాసలోని ప్రభుత్వాస్పత్రికి తరలించేం దుకు నిర్ణయించారు. 108 వాహనంలో తరలించేందుకు సిద్ధమయ్యారు. 108 సిబ్బంది ఒకరే రావడం, కుటుంబసభ్యులు అందుబాటులో లేకపోవడం, స్థానికులను పిలి చినా ఎవరూ రాకపోవడంతో వీఆర్వో వృద్ధుడ్ని స్ట్రెక్చర్‌పై ఎక్కించి 108 వాహనంలో చేర్చి దగ్గరుండి ఆస్పత్రిలో చేర్పించారు.

ఓ దివ్యాంగ వృద్ధుడికి వీఆర్వో బాసట
కరోనా సోకిన వృద్ధుణ్ని అంబులెన్స్‌లోకి ఎక్కిస్తున్న వీఆర్వో జాబేరు

పలాస: కాశీబుగ్గలోని ఓ వీధిలో దివ్యాంగ వృద్ధుడికి ఆదివారం కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈమేరకు రెవెన్యూ, వైద్యఆరోగ్య శాఖ అధికా రులు అతడికి సమాచారమిచ్చారు. వీఆర్వో షేక్‌ జాబేరు బాధితుడ్ని పరామ ర్శించారు. కుటుంబసభ్యులెవరూ అందు బాటులో లేక పోవడంతో ధైర్యం చెప్పా రు. పరిస్థితి విషమంగా ఉండడంతో పలాసలోని ప్రభుత్వాస్పత్రికి తరలించేం దుకు నిర్ణయించారు. 108 వాహనంలో తరలించేందుకు సిద్ధమయ్యారు. 108 సిబ్బంది ఒకరే రావడం, కుటుంబసభ్యులు అందుబాటులో లేకపోవడం, స్థానికులను పిలి చినా ఎవరూ రాకపోవడంతో వీఆర్వో వృద్ధుడ్ని స్ట్రెక్చర్‌పై ఎక్కించి 108 వాహనంలో చేర్చి దగ్గరుండి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆ వృద్ధుడు కోలుకుంటు న్నాడు. వీఆర్వో షేక్‌ జాబేరు చొరవకు తహసీల్దారు మధుసూదనరావు తదితరులు అభినందించారు. 

 

 

Updated Date - 2021-05-17T04:49:39+05:30 IST