నూతన కమిటీ నియామకం
ABN , First Publish Date - 2021-10-18T04:57:39+05:30 IST
ఆంధ్రప్రదేశ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్వోస్ అసోసియేషన్ రాష్ట్రస్థాయి నూతన కమిటీ నియామకం ఆదివారం గుంటూరులో జరిగింది.
గుంటూరు, అక్టోబరు 17: ఆంధ్రప్రదేశ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్వోస్ అసోసియేషన్ రాష్ట్రస్థాయి నూతన కమిటీ నియామకం ఆదివారం గుంటూరులో జరిగింది. అరండల్పేటలో జరిగిన సమావేశంలో కొత్త కమిటీని ప్రకటించారు. కమిటీ రాష్ట్ర అధ్యక్షుడుగా పి.ప్రసన్నకుమార్, ప్రధాన కార్యదర్శి బీకేవీ మురళీరాజు, అసోసియేటెడ్ అధ్యక్షుడు బి.కోటేశ్వరరావు, కోశాధికారి ఎం.రాజమోహన్రావు, అసోసియేట్ సెక్రటరీ సి.నాగేంద్రతో పాటు పలువురు సభ్యులను ఎన్నుకున్నారు.