‘సీలేరు’లో నాలుగు యూనిట్లు వినియోగం

ABN , First Publish Date - 2020-02-22T10:45:03+05:30 IST

‘సీలేరు’లో నాలుగు యూనిట్లు వినియోగం

‘సీలేరు’లో నాలుగు యూనిట్లు వినియోగం

సీలేరు, ఫిబ్రవరి 21 : గ్రిడ్‌ అధికారుల ఆదేశాల మేరకే సీలేరు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తున్నట్టు ఏపీ జెన్‌కో ఈఈ (ఓఅండ్‌ఎం) మల్లేశ్వరప్రసాద్‌ తెలిపారు. శుక్రవారం ఆయన ఇక్కడి విలేఖరులతో మాట్లాడారు. సీలేరు జలవిద్యుత్‌ కేంద్రంలో ప్రస్తుతం నాలుగు యూనిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు రెండు రోజుల క్రితమే మొదటి యూనిట్‌ పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకు వచ్చినట్టు చెప్పారు. రెండో యూనిట్‌కు  జనరేటర్‌ ప్రొటక్షన్‌ ప్యానల్స్‌ను మార్చాల్చి ఉందని, దీని కోసం గ్రిడ్‌  అధికారులను ఎల్‌సీ అనుమతులు  కోరామన్నారు.  జలవిద్యుత్‌ కేంద్రంలో గ్రిడ్‌ డిమాండ్‌ మేరకు రోజుకు రెండు మిలియన్‌ యూనిట్ల నుంచి 2.5 మిలియన్‌ యూనిట్ల వరకు ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు. 

Updated Date - 2020-02-22T10:45:03+05:30 IST