కొత్తగా 27 కొవిడ్ కేసులు
ABN , First Publish Date - 2021-01-21T06:01:17+05:30 IST
జిల్లాలో బుధవారం కొత్తగా 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
60,090కు చేరిన మొత్తం బాధితుల సంఖ్య
విశాఖపట్నం, జనవరి 20(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో బుధవారం కొత్తగా 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసులు 60,090కు చేరాయి. వీరిలో వైరస్ నుంచి 59,419 మంది కోలుకోగా, మరో 140 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ జిల్లాలో ఇప్పటివరకు 531 మంది మృత్యువాత చెందారు.