ఆక్రమణలు తొలగింపు
ABN , First Publish Date - 2020-09-23T08:10:17+05:30 IST
మండలంలోని గిడిజాల గ్రామంలో ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణాలను మంగళవారం రెవెన్యూ అధికారులు తొలగించారు.
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
ఆనందపురం, సెప్టెంబరు 22: మండలంలోని గిడిజాల గ్రామంలో ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణాలను మంగళవారం రెవెన్యూ అధికారులు తొలగించారు. మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘ఆగని ఆక్రమణలు’ కథనానికి స్పందించిన తహసీల్దార్ కె.వేణుగోపాలరావు, ఆర్ఐ వనజ, వీఆర్వో కనకారావుతో పాటు సర్వే సిబ్బంది ఆక్రమణలకు గురైన ప్రాంతాలను పరిశీలించారు.
గిడిజాల సర్వే నంబర్-140లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ప్రహరీ గోడ నిర్మించినట్టు గుర్తించి సిబ్బందితో వాటిని తొలగించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టడం చట్టరీత్యా నేరమని, అటువంటి వారిని క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.