అనాధ శరణాలయంలో వితరణ చేస్తున్న బీజేపీ నాయకులు
ABN , First Publish Date - 2020-09-26T09:33:49+05:30 IST
పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు కాశీ విశ్వనాఽథరాజు, సింబియోసిస్ నరేశ్కుమార్లు
అనాధ శరణాలయాల్లో బీజేపీ వితరణ
విశాఖపట్నం, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు కాశీ విశ్వనాఽథరాజు, సింబియోసిస్ నరేశ్కుమార్లు విశాఖలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనాధ శరణాలయాలు, వృద్ధాశ్రమాల్లో ఉంటున్న వారికి ఆహార పదార్థాలు పంచిపెట్టారు. సింహాచలం గోశాలలో మూగజీవాలకు ఎండుగడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.