ఆటో ఢీకొట్టడంతో యువకుడి మృతి
ABN , First Publish Date - 2020-09-26T09:31:16+05:30 IST
ఆటో ఢీకొట్టిన ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న తండ్రీకొడుకుల్లో కొడుకు మృతి చెందగా తండ్రి గాయపడ్డాడు. ఊర్వశి కూడలి వద్ద శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి కంచరపాలెం పోలీసు
తాటిచెట్లపాలెం, సెప్టెంబరు 25: ఆటో ఢీకొట్టిన ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న తండ్రీకొడుకుల్లో కొడుకు మృతి చెందగా తండ్రి గాయపడ్డాడు. ఊర్వశి కూడలి వద్ద శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాలు ఇవీ.
బర్మాక్యాంపు ప్రాంతానికి చెందిన రాయితి సత్తిబాబు, ఆయన కొడుకు తోటరాజు (32) ఫిషింగ్ హార్బర్కు వెళ్లి చేపలు కొనుక్కుని తిరిగి వస్తున్నారు. ఎదురుగా వస్తున్న ఆటో వీరిని ఢీకొట్టడంతో కిందపడిపోయాడు. వాహనం నడుపుతున్న తోటరాజు అక్కడికక్కడే చనిపోయాడు. చేపల వ్యాపారం నిర్వహించే తోటరాజుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సీఐ కృష్ణారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.