ఎస్పీబీకి టీడీపీ నాయకుల ఘన నివాళి

ABN , First Publish Date - 2020-09-26T09:28:24+05:30 IST

నగంధర్వుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం మరణం సంగీత ప్రపంచానికి, ఆయన అభిమానులకు తీరనిలోటని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.

ఎస్పీబీకి టీడీపీ నాయకుల ఘన నివాళి

మహారాణిపేట, సెప్టెంబరు 25: గానగంధర్వుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం మరణం సంగీత ప్రపంచానికి, ఆయన అభిమానులకు తీరనిలోటని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అర్బన్‌ పార్టీ కార్యాలయంలో శుక్రవారం బాలు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఎందరో వర్ధమాన గాయనీగాయకులను సంగీత ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం అన్నారు.


ఆయన ఆత్మశాంతించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి చోడే వెంకటపట్టాభిరామ్‌, జి.రామానాయుడు, పైలా ముత్యాలనాయుడు, శివాజీ, అనంతలక్ష్మి, సత్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-26T09:28:24+05:30 IST