నేటి నుంచి డిగ్రీ పరీక్షలు
ABN , First Publish Date - 2020-09-28T10:48:00+05:30 IST
ఈ నెల 28 నుంచి డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీ క్ష జరగనున్నాయి. కరోనా వైరస్ వల్ల వాయిదా పడుతూ వస్తున్న పరీక్షలను నిర్వహించేందుకు ఆంధ్ర యూనివర్శిటీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
విశాఖపట్నం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 28 నుంచి డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీ క్ష జరగనున్నాయి. కరోనా వైరస్ వల్ల వాయిదా పడుతూ వస్తున్న పరీక్షలను నిర్వహించేందుకు ఆంధ్ర యూనివర్శిటీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం నుంచి వచ్చేనెల తొమ్మిదో తేదీ వరకు డిగ్రీ ఆరో సెమిస్టర్(ఫైనలియర్) విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా రెండు పూటలా పరీక్షలు నిర్వహించనున్నారు.
ఉదయం 9 గంటలు నుంచి 12 గంటల వరకు ఆర్ట్స్ గ్రూపులైన బీఏ, బీకామ్, బీబీఏ, బీసీఏ గ్రూపు విద్యార్థులకు, మధ్యాహ్నం 2 గంటలు నుంచి 5 గంటల మధ్య సైన్స్ గ్రూపు బీఎస్సీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఏయూ అనుబంధంగా ఉన్న 220కుపైగా కాలేజీలకు చెందిన సుమారు 30 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హజరు కానున్నారు.