రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్లో కీర్తికకు స్వర్ణ పతకం
ABN , First Publish Date - 2021-03-01T06:34:16+05:30 IST
రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ చాంపియన్షిప్ టోర్నీలో విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహించిన బి.కీర్తిక స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.
విశాఖపట్నం(స్పోర్ట్సు), ఫిబ్రవరి 28: రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ చాంపియన్షిప్ టోర్నీలో విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహించిన బి.కీర్తిక స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని స్పోర్ట్స్ అఽథారిటీ ఆఫ్ తెలంగాణ(శాట్) షూటింగ్ అకాడమీ హాల్లో జరిగిన ఈ టోర్నీలో జూనియర్ మహిళల విభాగంలో కీర్తిక పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో అద్భుత ప్రతిభ కనబరిచి పసిడి పతకం సొంతం చేసుకున్నది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కీర్తిక, నగరంలోని భరత్ షూటింగ్ అకాడమీలో శిక్షణ పొందింది. త్వరలో జరగనున్న జాతీయ స్థాయి టోర్నీలో కూడా పతకం సాధిస్తుందని కోచ్లు సాయి వర్మ, అకాడమీ ఫౌండర్ ఆర్.గణేశ్ ఆకాంక్షించారు.