వీఎస్యూలో కరోనా వ్యాక్సినేషన్
ABN , First Publish Date - 2021-10-22T04:20:09+05:30 IST
మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో గురువారం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో కసుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సహకారంతో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు.
వెంకటాచలం, అక్టోబరు 21 : మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో గురువారం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో కసుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సహకారంతో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా వీఎస్యూ రెక్టార్ ఎం.చంద్రయ్య, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ సుజాఎస్ నాయర్ విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రెక్టార్ చంద్రయ్య మాట్లాడుతూ కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న తరుణంలో అందరూ ఖచ్చితంగా వ్యాక్సిన్ చేయించుకోవాలని సూచించారు. కాగా వీఎస్యూ సిబ్బందికి, విద్యార్థులకు వ్యాక్సిన్ వేయించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కసుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శంకరయ్య, వీఎస్యూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ అల్లం ఉదయ్ శంకర్, సిబ్బంది ఉస్మాన్ అలీ, ఏఎన్ఎంలు అనితా, సుగుణ, ఆశావర్కర్ మేరీ తదితరులున్నారు.