లాంచ్ అయిన 24 గంటల్లోనే.. ఇండియాలో ప్రభంజనం సృష్టించిన ‘వీయూ సినిమా స్మార్ట్ టీవీ’

ABN , First Publish Date - 2020-07-07T22:46:35+05:30 IST

భారత్‌లో ‘వీయూ సినిమా స్మార్ట్ టీవీ’ అమ్మకాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో విడుదల చేసిన 24 గంటల్లోనే

లాంచ్ అయిన 24 గంటల్లోనే.. ఇండియాలో ప్రభంజనం సృష్టించిన ‘వీయూ సినిమా స్మార్ట్ టీవీ’

న్యూఢిల్లీ: భారత్‌లో ‘వీయూ సినిమా స్మార్ట్ టీవీ’ అమ్మకాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో విడుదల చేసిన 24 గంటల్లోనే 32, 43 అంగుళాల టీవీలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ టీవీల ప్రారంభ ధర రూ. 12,999 మాత్రమే. వీయూ సినిమా స్మార్ట్ టీవీకి యూజర్లు 5 పాయింట్లకు గాను 4.7 పాయింట్లు ఇచ్చినట్టు ఆ సంస్థ చైర్మన్ అండ్ సీఈవో దేవితా సరాఫ్ తెలిపారు. ఫలితంగా దేశంలో అత్యధిక రేటింగ్ కలిగిన టీవీ బ్రాండ్‌గా రికార్డులకెక్కింది. అయితే, ఇతర టీవీ బ్రాండ్లతో పోలిస్తే తమ ఉత్పత్తుల ధర 8 నుంచి 10 శాతం అదనంగా ఉంటుందని పేర్కొన్నారు. ధరకు తగ్గ నాణ్యత, సేవలు ఉంటాయని దేవితా సరాఫ్ వివరించారు.


Updated Date - 2020-07-07T22:46:35+05:30 IST