లారీని ఢీ కొన్న మోటారు బైక్‌ : యువకుడి దుర్మరణం

ABN , First Publish Date - 2021-10-21T03:22:24+05:30 IST

మండలంలోని చిల్లకూరు వడ్డిపాళెం వద్ద బుధవారం రాత్రి జాతీయ రహదారిపై కంటైనర్‌ లారీని, మోటారు బైక్‌ ఢీ కొంది.

లారీని ఢీ కొన్న మోటారు బైక్‌ : యువకుడి దుర్మరణం
సురేంద్ర మృతదేహం

పెళ్లకూరు, అక్టోబరు 20 : మండలంలోని చిల్లకూరు వడ్డిపాళెం వద్ద బుధవారం రాత్రి జాతీయ రహదారిపై కంటైనర్‌ లారీని, మోటారు బైక్‌ ఢీ కొంది. ఈ ప్రమాదంలో సురేంద్ర అనే యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు, వెంకటాచలం మండలం కసుమూరుకి చెందిన కొలిగర్ల సురేంద్ర (28) కొత్తూరులో జరిగే బంధువుల వివాహానికి మోటారు బైక్‌లో బుధవారం సాయంత్రం వచ్చాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో సురేంద్ర సొంతపనిమీద కొత్తూరుకి చెందిన తన బంఽధువు కంచి వినయ్‌ అనే యువకుడిని మోటారు బైక్‌పై ఎక్కించుకొని నాయుడుపేట వైపు వెళ్తున్నాడు. చిల్లకూరు వడ్డిపాళెం వద్ద ఉన్న చండికాపరమేశ్వరి గుడి సమీపంలో ముందు వెళ్తున్న లారీని అధిగమించే ప్రయత్నంలో ఎదురుగా శ్రీకాళహస్తి వైపు వెళ్తున్న కంటైనర్‌ లారీని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో సురేంద్ర లారీ టైరు కింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. వినయ్‌కు స్వల్పగాయాలు అయ్యాయి. సురేంద్రకు భార్య ప్రశాంతి, ఓ కుమారుడు ఉన్నాడు. ప్రశాంతి ప్రస్తుతం గర్భవతి అని తెలిసింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన  ఎస్‌ఐ మనోజ్‌కుమార్‌ మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

---------------




Updated Date - 2021-10-21T03:22:24+05:30 IST