త్వరలో బీజేపీలో చేరనున్న వీవీఎస్ లక్ష్మణ్
ABN , First Publish Date - 2021-10-27T23:07:21+05:30 IST
త్వరలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ బీజేపీలో చేరనున్నారు. లక్ష్మణ్, బీజేపీ జాతీయ నేతలతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం.
హైదరాబాద్: త్వరలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ బీజేపీలో చేరనున్నారు. లక్ష్మణ్, బీజేపీ జాతీయ నేతలతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం. లక్ష్మణ్ చేరికకు కేంద్ర హోమంత్రి అమిత్షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ వ్యాఖ్యాతగా దుబాయ్లో వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఒక నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ ఎన్నికల్లో పోటీ చేస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. 2012లో అంతర్జాతీయ క్రికెట్కు లక్ష్మణ్ వీడ్కోలు పలికారు. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టకు మెంటార్గా ఉన్నారు.