చిన్న సంస్థలకు వాద్వానీ ఫౌండేషన్ అండ
ABN , First Publish Date - 2020-07-08T06:07:53+05:30 IST
చిన్న, మధ్య స్థాయి సంస్థలకు వాద్వానీ ఫౌండేషన్ (డబ్ల్యూఎఫ్) అండగా నిలవనుంది. ‘సహాయత బిజినెస్ స్టెబిలిటీ’ కార్యక్రమం కింద 10 వేల వరకూ ఎస్ఎంఈలకు వ్యాపార కొనసాగింపు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): స్థిరత్వం, వృద్ధి సాధించడానికి సాయం చేస్తుంది. ఇందుకోసం సిడ్బీ, క్లిక్స్ కేపిటల్, ఐఐఎ్ఫఎల్ ఫైనాన్స్ తదితరాలతో చేతులు కలిపింది. ఆగస్టు నుంచి ప్రతి నెల 50 చిన్న, మధ్య స్థాయి సంస్థలకు అండగా నిలుస్తుంది. దీన్ని నెలకు 500 సంస్థలకు పెంచుతుంది. కొవిడ్ బాధితులను ఆదుకోవడానికి వాద్వానీ ఫౌండేషన్ రూ.200 కోట్లు ఖర్చు చేయనుంది.