వామనరావు హత్య విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తా: ఉత్తమ్

ABN , First Publish Date - 2021-03-09T20:21:50+05:30 IST

వామనరావు హత్య విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వామనరావు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కూడా...

వామనరావు హత్య విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తా: ఉత్తమ్

హైదరాబాద్: వామనరావు హత్య విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వామనరావు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కూడా ఎలాంటి చర్య లేదని  ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వామనరావు హత్యపై సీబీఐ విచారణ చేయకుంటే ఈ కేసును కొట్టివేసే అవకాశం ఉందని ఉత్తమ్ జోస్యం చెప్పారు. ఉద్యమంలో కీలకంగా పని చేసిన న్యాయవాదులకు రక్షణ లేదన్నారు. వామనరావు వాగ్మూలంలో అధికార పార్టీ నేతల పేర్లు చెప్పినా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఉత్తమ్ ప్రశ్నించారు. ఇండియన్ మెడికల్ అస్సోసియేషన్ వాళ్లకు ప్రొటెక్ట్ యాక్ట్ ఎలా ఉందో.. న్యాయవాదులకు కూడా అలాంటి యాక్ట్‌ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల పోరాటం కూడా ఉధృతం చేయాలని సూచించారు. న్యాయవాదుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని వెల్లడించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి సరైన బుద్ది చెప్పాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. 

Updated Date - 2021-03-09T20:21:50+05:30 IST