Wanaparthyలో కుటుంబం కిడ్నాప్...వారం పాటు చింత్రహింసలు

ABN , First Publish Date - 2021-08-19T14:35:50+05:30 IST

జిల్లాలోని వీపనగండ్ల మండలం సంపట్రావుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబాన్ని మేకల చంద్రయ్య అనే వ్యక్తి కిడ్నాప్ చేసి తన ఇంట్లోనే నిర్బంధించాడు.

Wanaparthyలో కుటుంబం కిడ్నాప్...వారం పాటు చింత్రహింసలు

వనపర్తి: జిల్లాలోని వీపనగండ్ల మండలం సంపట్రావుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబాన్ని మేకల చంద్రయ్య అనే వ్యక్తి కిడ్నాప్ చేసి తన ఇంట్లోనే నిర్బంధించాడు. ఆ కుటుంబంపై వారం పాటు దాష్టీకం ప్రదర్శించారు. భార్యాభర్తలను ఇంట్లో నిర్బంధించి  చిత్రహింసలకు గురిచేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ సరూర్ నగర్ చెందిన శ్రీకాంత్ కుటుంబాన్ని సంపట్రావుపల్లికి చెందిన మేకల చంద్రయ్య కిడ్నాప్ చేశాడు. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో పని ఉందని చెప్పి సొంత గ్రామానికి తీసుకొచ్చి శ్రీకాంత్ కుటుంబాన్ని చంద్రయ్య నిర్బంధించాడు. చివరకు గ్రామస్తులు, పోలీసుల చొరవతో ఆ కుటుంబానికి విముక్తి లభించింది. ప్రస్తుతం శ్రీకాంత్ కుటుంబం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై వీపనగండ్ల పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.

Updated Date - 2021-08-19T14:35:50+05:30 IST