విద్యుత్ సంస్థల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
ABN , First Publish Date - 2022-01-21T06:48:15+05:30 IST
విద్యుత్ సంస్థల అభివృద్ధిలో కాంట్రా క్టర్లు భాగస్వాములు కావాలని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు.
సూర్యాపేట(కలెక్టరేట్), జనవరి 20: విద్యుత్ సంస్థల అభివృద్ధిలో కాంట్రా క్టర్లు భాగస్వాములు కావాలని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో తెలం గాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు విద్యుత్ రంగంలో ఏర్పడిన సంక్షోభమే మూలమైందన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు మజీద్, పర్వతాలు, దోసకాయల శ్రీనివాస్, వేణుగోపాల్, యాదయ్య, సత్తిరెడ్డి, వహీద్ పాల్గొన్నారు.