‘‘ప్లీజ్ నన్ను కాల్చి చంపొద్దు’’ అంటూ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లొంగుబాటు

ABN , First Publish Date - 2020-09-28T12:24:49+05:30 IST

ఓ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ ‘‘ప్లీజ్ నన్ను కాల్చి చంపొద్దు’’ అంటూ మెడలో ప్లకార్డు వేసుకొని ఏకంగా పోలీసుస్టేషనుకు వచ్చి పోలీసుల ముందు లొంగిపోయిన...

‘‘ప్లీజ్ నన్ను కాల్చి చంపొద్దు’’ అంటూ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లొంగుబాటు

లక్నో (ఉత్తరప్రదేశ్): ఓ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ ‘‘ప్లీజ్ నన్ను కాల్చి చంపొద్దు’’ అంటూ మెడలో ప్లకార్డు వేసుకొని ఏకంగా పోలీసుస్టేషనుకు వచ్చి పోలీసుల ముందు లొంగిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ పోలీసుస్టేషనులో జరిగింది.సంభాల్ పట్టణానికి చెందిన నయీం అనే వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ మెడలో నన్ను కాల్చి చంపొద్దు అంటూ ప్లకార్డు వేసుకొని సంభాల్ పట్టణంలోని నఖాసా పోలీసుస్టేషనుకు వచ్చి లొంగిపోయాడు. ‘‘నేను చాలా తప్పులు చేశాను. సంభాల్ పోలీసులంటే నాకెంతో భయం...అందుకే నేను చేసిన తప్పులను అంగీకరిస్తూ పోలీసుల ముందు లొంగిపోతున్నాను..నన్ను కాల్చి చంపొద్దు ప్లీజ్’’ అంటూ నయీం ప్లకార్డులో రాశారు. 


గ్యాంగ్‌స్టర్ నయీంపై గ్యాంగ్‌స్టర్ యాక్టు కింద కేసు నమోదు చేశామని స్టేషన్ హౌస్ ఆఫీసరు ధర్మపాల్ సింగ్ చెప్పారు. గ్యాంగ్‌స్టర్ నయీం తమ పోలీసుస్టేషనులో లొంగిపోయాడని సంభాల్ పోలీసులు ట్వీట్ చేశారు.

Updated Date - 2020-09-28T12:24:49+05:30 IST