స్థలాల కోసం పోరు.. ప్రభుత్వ స్థలంలో గుడిసెలకు యత్నం
ABN , First Publish Date - 2021-08-03T19:44:05+05:30 IST
వరంగల్: నర్సంపేటలో పేదలు ఇళ్ల స్థలాల కోసం ఆందోళనకు దిగారు.
వరంగల్: నర్సంపేటలో పేదలు ఇళ్ల స్థలాల కోసం ఆందోళనకు దిగారు. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసేందుకు ప్రయత్నించారు. వామపక్షాలతో కలిసి ఎర్రజెండాలు పాతారు. అయితే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పేదలను అడ్డుకున్నారు. జెండాలను తొలగించారు. గత ఎన్నికల ముందు నర్సంపేట శివారులోని ప్రభుత్వ భూమిలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని సర్కార్ హామీ ఇచ్చింది. ఆ హామీ ఇప్పటికీ నెరవేరకపోవడంతో పేదలు ఆక్రమణలకు సిద్ధమయ్యారు. తమకు డబుల్ బెడ్ రూం ఇళ్లు అవసరంలేదని స్థలాలు కేటాయిస్తే చాలని తెలిపారు.