వరంగల్: తొమ్మిది హత్యల కేసులో నేడు తుది తీర్పు

ABN , First Publish Date - 2020-10-28T13:22:06+05:30 IST

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తొమ్మిది హత్యల కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది.

వరంగల్: తొమ్మిది హత్యల కేసులో నేడు తుది తీర్పు

వరంగల్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తొమ్మిది హత్యల కేసులో  నేడు తుది తీర్పు వెలువడనుంది. నిందితుడికి ఉరి లేదా యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత మే 21న వరంగల్ నగర శివారులోని గొర్రెకుంట సాయి దత్త గన్ని బ్యాగ్స్ కంపెనీలో 9మందికి నిందితుడు మత్తు ఇచ్చి సృహ కోల్పోయిన తర్వాత సజీవంగా బావిలో పడేసి హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడు బీహార్‌కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్‌కు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి నేడు శిక్షను ఖరారు చేయనున్నారు. నిందితుడి పై 7 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. నెల రోజుల్లోనే పోలీసులు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. 

Updated Date - 2020-10-28T13:22:06+05:30 IST