వరంగల్ జిల్లాలో దారుణం

ABN , First Publish Date - 2021-04-11T18:31:02+05:30 IST

పరకాల మండలం, హైబోతుపల్లిలో దారుణం జరిగింది. ఇద్దరు కౌలు రైతులకు చెందిన మిర్చి పంటను...

వరంగల్ జిల్లాలో దారుణం

వరంగల్ జిల్లా: పరకాల మండలం, హైబోతుపల్లిలో దారుణం జరిగింది. ఇద్దరు కౌలు రైతులకు చెందిన  మిర్చి పంటను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. కళ్ల ముందే 90 క్వింటాళ్ల మిర్చి పంట కాలి బూడిదయింది. ఓ వ్యక్తి దగ్గర కాసగోని జంపయ్య, గుర్రపు మహేందర్ గౌడ్ భూమిని కౌలుకు తీసుకుని మిర్చి పంటను సాగు చేశారు. ఆరుగాలం కష్టపడి పంటను కాపాడుకుంటూ వచ్చారు. అనుకున్నట్టే దిగుబడి కూడా బాగానే వచ్చింది. తమ కష్టానికి తగిన ఫలితం వచ్చిందని సంతోషం పడినా.. కౌలు రైతుల ఆనందం ఆర్తనాదంగా మారింది. రాత్రికి రాత్రి గుర్తు తెలియని దుండగులు మిర్చి పంటకు నిప్పు పెట్టారు. దీంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Updated Date - 2021-04-11T18:31:02+05:30 IST