వరంగల్ జిల్లా: నర్సంపేటలో దారుణం

ABN , First Publish Date - 2021-05-13T18:09:07+05:30 IST

వరంగల్: రూరల్ జిల్లా, నర్సంపేట శివారు కాకతీయనగర్ కాలనీలో కబ్జా ముఠా రెచ్చిపోయింది.

వరంగల్ జిల్లా: నర్సంపేటలో దారుణం

వరంగల్: రూరల్ జిల్లా, నర్సంపేట శివారు కాకతీయనగర్ కాలనీలో కబ్జా ముఠా రెచ్చిపోయింది. దుండగులు స్థానికులపై దౌర్జన్యానికి తెగబడ్డారు. ఇక్కడ అసైన్డు భూముల్లో నెలరోజులుగా గుడిసెలు వేసుకుని సుమారు 3 వందల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇదే భూమిపై కన్నేసిన స్థానిక బాడా బాబులు వారి అనుచరులతో పేదల గుడిసెలపై దాడి చేయించారు. సుమారు 40 మంది దుండగులు మారణాయుధాలతో వచ్చి బీభత్సం సృష్టించారు. పడుకున్నవారిపై విచక్షణారహితంగా దాడి చేయడంతోపాటు వాడి గుడిసెలు దగ్ధం చేశారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు అన్న తేడా లేకుండా అందరిపై పాశవికంగా దాడి చేశారు. సమాచారం అందుకుని రంగంలోకి దిగిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలియవచ్చింది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.

Updated Date - 2021-05-13T18:09:07+05:30 IST