కాజీపేట రైల్వేస్టేషన్లో స్వల్ప ప్రమాదం
ABN , First Publish Date - 2020-09-29T18:23:53+05:30 IST
జిల్లాలోని కాజీపేట రైల్వే స్టేషన్లో మంగళవారం స్వల్ప ప్రమాదం జరిగింది.
వరంగల్: జిల్లాలోని కాజీపేట రైల్వే స్టేషన్లో మంగళవారం స్వల్ప ప్రమాదం జరిగింది. రన్నింగ్లో ఉన్న గూడ్స్ రైలు డోర్ తగిలి సిగ్నలింగ్ వ్యవస్థ, నీటి పైప్ లైన్ దెబ్బతిన్నది. ఈ ప్రమాదం నేపథ్యంలో స్టేషన్లో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలిసిన వెంటనే రైల్వే అధికారులు అక్కడకు చేరుకుని మరమత్తు పనులు చేపట్టారు.