వరంగల్‌ వేదికగా టీఆర్‌ఎస్‌ మరో భారీ సభ

ABN , First Publish Date - 2021-10-14T05:16:26+05:30 IST

వరంగల్‌ వేదికగా టీఆర్‌ఎస్‌ మరో భారీ సభ

వరంగల్‌ వేదికగా టీఆర్‌ఎస్‌ మరో భారీ సభ

 నవంబర్‌ 15న ‘తెలంగాణ విజయగర్జన’ పేరిట నిర్వహణ

 టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వెల్లడి

హనుమకొండ టౌన్‌, అక్టోబరు 13 : తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని నవంబర్‌ 15న వరంగల్‌లో తెలంగాణ విజయగర్జన సభ నిర్వహించనున్నారు. ఈ మే రకు రాష్ట్ర పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  కేటీఆర్‌ బుధవారం హైదరాబాద్‌లో అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ విజయ గర్జన సభ సన్నాహక సమావేశం రాష్ట్ర వ్యాప్తం గా అన్ని నియోజకవర్గాల్లో ఒకేరోజు ఈనెల 27న నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. సభ ఏర్పాటుకు సంబంధించి స్థలం ఇంకా ఫైనల్‌ కాలేదు. జిల్లా పార్టీ నేతలు సభను ఎక్కడ నిర్వహించాలనే విషయమై చర్చిస్తున్నట్లు తెలిసింది. గతంలో పలు సమావేశాలకు వేదిక అయిన ప్రకాశ్‌రెడ్డిపేటలో ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. ప్రస్తుతం సభకు సరిపోయే స్థలం అక్కడ లేదు. దీంతో మామునూరు లేదా ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఏరియాలో నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. రెండు, మూడురోజుల్లో సభ నిర్వహించే స్థలం ఫైనల్‌ చేయనున్నట్లు సమాచారం. కాగా, ఈనెల 25న హైదరాబాద్‌లో నిర్వహించే ప్లీనరీ సమావేశంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. ఈ లోపు జిల్లా పార్టీ అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలు తెలిపారు. 

Updated Date - 2021-10-14T05:16:26+05:30 IST