కాకతీయ కెనాల్‌లో కొట్టుకుపోయిన విద్యార్థుల మృతదేహాలు లభ్యం

ABN , First Publish Date - 2022-01-11T16:41:41+05:30 IST

మూడు రోజుల క్రితం వరంగల్ కాకతీయ కెనాల్‌లో కొట్టుకుపోయిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

కాకతీయ కెనాల్‌లో కొట్టుకుపోయిన విద్యార్థుల మృతదేహాలు లభ్యం

వరంగల్: మూడు రోజుల క్రితం వరంగల్ కాకతీయ కెనాల్‌లో కొట్టుకుపోయిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట దగ్గర మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 20కిలో మీటర్ల మేర మృతదేహాలు కొట్టుకుపోయాయి. విద్యార్థులు ఆకాశ్, హర్ష మూడు రోజుల క్రితం ఈతకోసం కాకతీయ కెనాల్‌లోకి వెళ్లి గత్లంతైన విషయం తెలిసిందే. ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విద్యార్థుల మృతితో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. 

Updated Date - 2022-01-11T16:41:41+05:30 IST