Warangalలో మంత్రులు ఎర్రబెల్లి, నిరంజన్ రెడ్డి పర్యటన

ABN , First Publish Date - 2022-01-18T18:35:26+05:30 IST

జిల్లాలోని పరకాల - నర్సంపేట సబ్ డివిజన్లలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, నిరంజన్ రెడ్డి ప్రజాప్రతినిధుల బృందం పర్యటించింది.

Warangalలో మంత్రులు ఎర్రబెల్లి, నిరంజన్ రెడ్డి పర్యటన

వరంగల్: జిల్లాలోని పరకాల - నర్సంపేట సబ్ డివిజన్లలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, నిరంజన్ రెడ్డి ప్రజాప్రతినిధుల బృందం మంగళవారం పర్యటించింది. ఈ సందర్భంగా  వడగండ్ల వానల ప్రభావంతో నష్టపోయిన పంటలను మంత్రులు పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు. మంత్రులను చూడగానే బాధిత రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పంట నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారు. మంత్రులతో కలిసి రైతు సమన్వయ బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా దర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి పంటలను పరిశీలించారు.

Updated Date - 2022-01-18T18:35:26+05:30 IST