వరంగల్: కరోనా థర్డ్ వేవ్లో తొలి మరణం?
ABN , First Publish Date - 2022-01-29T02:10:21+05:30 IST
కరోనా థర్డ్ వేవ్లో ఉమ్మడి జిల్లాలో తొలి మరణం
వరంగల్: కరోనా థర్డ్ వేవ్లో ఉమ్మడి జిల్లాలో తొలి మరణం నమోదయింది. థర్డ్ వేవ్ కరోనా సోకి జనగామ జిల్లాలో మొట్టమొదటి వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని లింగాలగణపురం మండలం కళ్లెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మూడు రోజులుగా జనగామ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.