ఐపీఎల్-2 ప్రారంభానికి ముందే ఆర్సీబీకి ఎదురుదెబ్బ

ABN , First Publish Date - 2021-08-31T01:30:49+05:30 IST

ఐపీఎల్ పార్ట్-2 ప్రారంభానికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు గట్టి

ఐపీఎల్-2 ప్రారంభానికి ముందే ఆర్సీబీకి ఎదురుదెబ్బ

బెంగళూరు: ఐపీఎల్ పార్ట్-2 ప్రారంభానికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చేతి వేలికి గాయం కారణంగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మిగతా సీజన్‌కు అందుబాటులో ఉండడం లేదని ఆర్సీబీ సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న భారత జట్టులో సభ్యుడైన సుందర్ ఫస్ట్ క్లాస్ ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. ఇండియాతో జరుగుతున్న ఈ వామప్ మ్యాచ్‌లో కౌంటీ సెలక్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సుందర్ చేతి వేలికి బంతి బలంగా తాకింది. మహ్మద్ సిరాజ్ వేసిన బౌన్సర్‌ను ఎదుర్కొనే క్రమంలో గాయమైంది. దీంతో అతడి స్థానంలో అక్ష్ దీప్‌ను తీసుకున్నట్టు ఆర్సీబీ తెలిపింది.  

Updated Date - 2021-08-31T01:30:49+05:30 IST