ఆసుపత్రిలో కరోనా రోగిపై వాచ్‌మెన్ అఘాయిత్యం

ABN , First Publish Date - 2020-11-07T12:24:48+05:30 IST

ముంబై నగరంలోని ఓ ఆసుపత్రిలో దారుణం జరిగింది....

ఆసుపత్రిలో కరోనా రోగిపై వాచ్‌మెన్ అఘాయిత్యం

ముంబై (మహారాష్ట్ర): ముంబై నగరంలోని ఓ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా మహిళా రోగిపై సాక్షాత్తూ ఆసుపత్రి వాచ్‌మెన్ అత్యాచారం చేసిన ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో వెలుగుచూసింది. ఓ మహిళ కరోనా పాజిటివ్ రావడంతో ముంబై నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది. ఈ నెల 5వతేదీన రాత్రి ఆసుపత్రి వాచ్ మెన్ కరోనా మహిళా రోగి ఉన్న గదిలోకి వచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆసుపత్రిలో తోటి రోగులు సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి వచ్చి బాధిత కరోనా రోగితో మాట్లాడి ఆసుపత్రి వాచ్ మెన్ పై కేసు నమోదు చేశారు. నిందితుడైన వాచ్ మెన్ ను అరెస్టు చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కురార్ పోలీసు సీనియర్ ఇన్ స్పెక్టరు బాబాసాహెబ్ సాలూంఖే చెప్పారు.ఆసుపత్రిలో కరోనా రోగిపై కూడా వాచ్ మెన్ అత్యాచారం జరపిన ఘటన ముంబైలో సంచలనం రేపింది. దీనిపై నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముంబై పోలీసులు చెప్పారు. 

Updated Date - 2020-11-07T12:24:48+05:30 IST