చెరువులకు పోలవరం నీళ్లు
ABN , First Publish Date - 2021-01-19T06:29:34+05:30 IST
చెరువులకు పోలవరం నీళ్లు
విజయవాడ రూరల్, జనవరి 18 : గొల్లపూడి ఎత్తిపోతల పథకం (జీపీఎస్), పోలవరం కాల్వ నీళ్లతో చెరువులను నింపి రైతులు రెండు పంటలు సాగు చేసుకునేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హామీ ఇచ్చారు. నున్న స్వప్న ఫంక్షన్ హాల్లో సోమవారం ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైతులు సాగునీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అంగజాల ఆంజనేయులు కుటుంబ సభ్యులను, మాతృమూర్తిని కోల్పోయిన యర్కారెడ్డి శివశేషిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైసీపీ నాయకులు కొమ్మా కోటేశ్వరరావు, యర్కారెడ్డి నాగిరెడ్డి, కర్రే విజయ్కుమార్, ఆర్వీఆర్, శీలం రంగారావు, బొమ్మిన శ్రీనివాసరావు, భీమవరపు శివరామిరెడ్డి, పోలారెడ్డి చంద్రారెడ్డి, అంగజాల హనుమాన్, రమేష్రెడ్డి పాల్గొన్నారు.