జల సంరక్షణ బాధ్యతగా భావించాలి
ABN , First Publish Date - 2021-03-03T05:50:29+05:30 IST
జల సంరక్షణ బాధ్యతగా భావించాలి
తలకొండపల్లి: జల సంరక్షణ ప్రతీ ఒక్కరు బాధ్యతగా భావించాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలని డీఆర్డీవో ప్రభాకర్ అన్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టాలన్నారు. మండల పరిషత్లో మంగళవారం జాతీయ జల్ మిషన్, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ, ఇతర సిబ్బందికి ఎంపీడీవో రాఘవులు అధ్యక్షత నీటి సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. డీఆర్డీవో, యువజన సంక్షేమ అధికారి ఐజయ్య నీటి సంరక్షణపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులందజేశారు. ఏపీవో కృష్ణ, ఏపీఎం శ్రీదేవి పాల్గొన్నారు.