ఐదు పంపుల ద్వారా ఎస్సారార్ జలాశయానికి నీరు
ABN , First Publish Date - 2020-08-08T06:27:24+05:30 IST
రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పుంపుహౌస్ నుంచి నీటి ప్రవాహం కొనసాగుతున్నది.
రామడుగు, ఆగస్టు 7: రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పుంపుహౌస్ నుంచి నీటి ప్రవాహం కొనసాగుతున్నది. ఇంత వరకు నాలుగు పంపుల ద్వారా ఎస్సారార్ జలాశయానికి నీటిని తరలించిన అధికారులు శుక్రవారం ఐదవ పంపును ఆన్చేసి వరద కాలువకు నీటిని విడుదల చేశారు. డెలివరీ సిస్టమ్ నుంచి గ్రావిటీ కాలువ ద్వారా వరద కాలువకు నీరు విడుదల చేస్తున్నారు. ఎస్సారార్ జలాశయానికి 15,750 క్యూసెక్కుల నీరు చేరుతోంది.