తిరుపతిలో వేకూల్ వారి ‘శుద్ధ’ నూతన స్టోర్

ABN , First Publish Date - 2021-06-17T23:34:01+05:30 IST

వేకూల్ ఫుడ్స్‌ తమ డెయిరీ బ్రాండ్ ‘శుద్ధ’ నూతన రిటైల్ స్టోర్‌ను తిరుపతిలో గురువారం ప్రారంభించింది. జిల్లాలో ఇది రెండో స్టోర్.

తిరుపతిలో వేకూల్ వారి ‘శుద్ధ’ నూతన స్టోర్

తిరుపతి: వేకూల్ ఫుడ్స్‌ తమ డెయిరీ బ్రాండ్ ‘శుద్ధ’ నూతన రిటైల్ స్టోర్‌ను తిరుపతిలో గురువారం ప్రారంభించింది. జిల్లాలో ఇది రెండో స్టోర్. పాలు, పాల ఉత్పత్తులకు సంబంధించి శుద్ధత, నాణ్యత, పోషకత, రుచులను అందించడంలో పేరెన్నిక గన్న పోషకులైన శుద్ధ తమ పాలను తాజాదనం, స్వచ్ఛతలకు హామీ ఇచ్చేందుకు కఠినమైన నాణ్యత, తనిఖీ చర్యలు చేపట్టి, రోజువారీ ప్రాతిపదికన స్థానిక రైతుల నుంచి సేకరిస్తున్నట్టు తెలిపింది. జీవకోనలో ప్రారంభించిన ఈ స్టోర్ తాజా పాలు, పెరుగు, నెయ్యి, మజ్జిగ, లస్సీ, కోవా లాంటి డెయిరీ ఉత్పత్తులను అందిస్తామని సంస్థ తమ ప్రకటనలో పేర్కొంది.


శుద్ధా స్క్వేర్ ప్రారంభోత్సవం సందర్భంగా... వేకూల్ ఫుడ్స్ హెడ్ ఆఫ్ డెయిరీ దేబాశిష్ సమాల్ మాట్లాడుతూ.. తిరుపతిలో మా రెండవ శుద్ధా స్క్రేర్ ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. తమ మొదటి స్టోర్‌ ద్వారా అందుకున్న మద్దతుతోనే ఇది సాధ్యమైందని తెలిపారు.

Updated Date - 2021-06-17T23:34:01+05:30 IST