మేం బీజేపీతో కలిసే ఉన్నాం: మనోహర్‌

ABN , First Publish Date - 2021-10-09T21:10:35+05:30 IST

తాము బీజేపీతో కలిసే ఉన్నామని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

మేం బీజేపీతో కలిసే ఉన్నాం: మనోహర్‌

ప్రకాశం: తాము బీజేపీతో కలిసే ఉన్నామని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ స్టాండ్ ప్రకారమే బద్వేలులో తమ అభ్యర్థిని నిలబెట్టడం లేదని తెలిపారు. బద్వేల్‌ ఉపఎన్నికలో బీజేపీ గెలుపు కోసం సహకరిస్తామని ప్రకటించారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెలిగొండ ప్రాజెక్టు గురించి సీఎం జగన్ ఎందుకు మాట్లాడటం లేదు? అని నాదెండ్ల ప్రశ్నించారు. రైతులను ప్రతీ విషయంలో ప్రభుత్వం మభ్యపెడుతూ మోసం చేస్తోందని దుయ్యబట్టారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలు మానుకొని అభివృద్ధిపై దృష్టి సారించాలని నాదెండ్ల మనోహర్ సూచించారు.

Updated Date - 2021-10-09T21:10:35+05:30 IST