క్రికెట్కు భారత్ రెడీ..?
ABN , First Publish Date - 2020-05-21T22:51:56+05:30 IST
ప్రస్తుత విపత్కర పరిస్థితుల కారణంగా మూడు నెలలుగా క్రికెట్ అనే మాటే ఎక్కడా వినిపించడం...
న్యూఢిల్లీ: ప్రస్తుత విపత్కర పరిస్థితుల కారణంగా మూడు నెలలుగా క్రికెట్ అనే మాటే ఎక్కడా వినిపించడం లేదు. అయితే మళ్లీ క్రికెట్ను ప్రారంభించాలని బీసీసీఐ ప్రయత్నిస్తోంది. దీనికోసం సౌత్ఆఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ను నిర్వహించేందుకు ప్రయత్నిస్తోంది. దీనికోసం ఆ దేశ క్రికెట్ బోర్డు సీఎస్ఏతో చర్చలు జరుపుతోంది.
దీనిపై బీసీసీఐ స్పందిస్తూ, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ నిర్వహించడంపై సీఎస్ఏతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. కానీ ప్రయాణ నిబంధనలు అమలులో ఉండడంతో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. అయితే సిరీస్ నిర్వహించేందుకు అన్ని రకాలుగా చర్యలు జరుపుతున్నామని బీసీసీఐ తెలిపింది.