చిన్నారులను ఆదుకుంటాం : సీడీపీవో
ABN , First Publish Date - 2022-01-20T06:18:27+05:30 IST
తల్లిదండ్రులు కోల్పోయిన అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకుంటామని కొండమల్లేపల్లి సీడీపీవో ఉదయ అన్నారు.
పెద్దఅడిశర్లపల్లి, జనవరి 19: తల్లిదండ్రులు కోల్పోయిన అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకుంటామని కొండమల్లేపల్లి సీడీపీవో ఉదయ అన్నారు. మండలంలోని కోదండపురం గ్రామంలో అనాథలుగా మారిన జావీద్, జునేద్లను ఆమె పరా మర్శించారు. వారి కుటుంబ ఆర్థిక స్థితిగతులు, వారికి కావాల్సి న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు కావాల్సిన సహాయసహకారాలు ప్రభుత్వం నుంచి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీన నల్లగొండ బాలల సంక్షేమ స మితి కార్యాలయానికి రావాలని చిన్నారులకు సూచించారు. ఆమె వెంట ఏసీడీపీవో సరళ, సూపర్వైజర్ మంజుల, డీసీపీయూ సి బ్బంది అంజలి, అంగనవాడీ టీచర్ పరిపూర్ణ పాల్గొన్నారు.