బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
ABN , First Publish Date - 2020-06-03T10:18:59+05:30 IST
పిడుగు పాటుతో మృతి చెందిన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పాముల పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు.
ఎస్సీ మరువాడ (జియ్యమ్మవలస), జూన్ 2: పిడుగు పాటుతో మృతి చెందిన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పాముల పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు. మంగళవారం ఆమె అలమండ పం చాయతీ ఎస్సీ మరువాడ గ్రామానికి వెళ్లి పిడుగు పాటుకు గురై మరణించిన బెలగాపు పండయ్య, పారయ్య, భూషణం కుటుంబాలను పరామర్శించారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, ప్రభుత్వపరంగా రావలసిన వైఎస్ఆర్ బీమా సహాయం సత్వరమే అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం నుంచి మ రే సహాయం కావాలన్నా నేరుగా తనను సంప్రదించాలని ఆమె సూచించారు. అర కు పార్లమెంటు నియోజకవర్గ వైసీసీ ఇన్చార్జి శత్రుచర్ల పరీక్షిత్రాజు, మండల ఎ న్నికల కన్వీనర్ బొంగు సురేష్, మండల కన్వీనర్ ఎం.గౌరీశంకరరావు పాల్గొన్నారు.
పిడుగు పాటుతో మరణించిన వారి కుటుంబాలను కురుపాం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు పరామర్శించారు. నేరుగా వారి కుటుం బాలతో కలిసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట ఉపాధ్యాయులు దాసరి రామారావు, వీఆర్వో ఎం.గౌరీశంకరరావు, తదితరులు ఉన్నారు.