వైసీపీలో తగిన న్యాయం జరగకనే టీడీపీలో చేరాం

ABN , First Publish Date - 2022-01-21T05:54:17+05:30 IST

వైసీపీలో తమకు తగిన న్యాయం జరగకపోవడంతో తాము టీడీపీలో చేరామని మండలంలోని మల్లంపేటలో నూతనంగా టీడీపీలో చేరిన నేతలు ఐనోలు బాలయ్య, పోలు రాములు, మూడమంచు పరిటయ్య తదితరులు పేర్కొన్నారు.

వైసీపీలో తగిన న్యాయం జరగకనే టీడీపీలో చేరాం
ఫోటోలు చూపుతున్న నేతలు

దొనకొండ, జనవరి 20 :  వైసీపీలో తమకు తగిన న్యాయం జరగకపోవడంతో తాము టీడీపీలో చేరామని మండలంలోని మల్లంపేటలో నూతనంగా టీడీపీలో చేరిన నేతలు ఐనోలు బాలయ్య, పోలు రాములు, మూడమంచు పరిటయ్య తదితరులు పేర్కొన్నారు. ‘టీడీపీ వారే టీడీపీలో చేరారు’ అని వైసీపీ నేతలు ప్రకటించడాన్ని వారు ఖండించారు.  తాము పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ప్రచారం చేశామన్నారు. నాటి ఫోటోలను వారు విలేకర్లకు అందజేశారు. తమపై దుష్ప్రచారాన్ని మానుకోవాలన్నారు. టీడీపీ నాయకులు వల్లపునేని వెంకటస్వామి, వడ్లమూడి చెన్నయ్యల నేతృత్వంలో సచ్ఛందంగా టీడీపీలో చేరినట్లు ప్రకటించారు. మల్లంపేట టీడీపీ నాయకుడు వల్లపునేని వెంకటస్వామి మాట్లాడుతూ వైసీపీ నాయకులు ఇప్పటికైనా దుష్ప్రచారాలు మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు మోడి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ వడ్లమూడి చెన్నయ్య, నాయకులు కొమ్మతోటి సుబ్బారావు, పత్తి  వెంకటేశ్వర్లు, యరగొర్ల బసవయ్య, వల్లపునేని హరి, నూతనంగా టీడీపీలో చేరిన కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-21T05:54:17+05:30 IST