తిరుపతి సీటు గెలిచి తీరాలి.. బీజేపీ శ్రేణులకు సునీల్దియోధర్ దిశానిర్దేశం
ABN , First Publish Date - 2020-10-29T17:42:36+05:30 IST
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని గెలిపించి తీరాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి, ఏపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దియోధర్ కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. తిరుపతిలోని ఆర్.ఎస్.మాడ వీధిలో వున్న పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన నాయకులతో సమావేశమయ్యారు.
తిరుపతి(చిత్తూరు): తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని గెలిపించి తీరాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి, ఏపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దియోధర్ కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. తిరుపతిలోని ఆర్.ఎస్.మాడ వీధిలో వున్న పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన నాయకులతో సమావేశమయ్యారు. తిరుపతి ఉప ఎన్నికకు ఇప్పటినుంచే సిద్ధం కావాలని సూచించారు. బలాలు, బలహీనతలను గుర్తించి తగిన ప్రణాళికతో ముందుకెళ్లాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చూడాలని, ప్రతి నాయకుడూ నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఇంటినీ ఖచ్చితంగా సందర్శించాలని సూచించారు. ప్రజల మనోభావాలను అధిష్ఠానానికి తెలియజేయాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు భానుప్రకాష్రెడ్డి, సామంచి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు దయాకర్రెడ్డి, తిరుపతి బీజేపీ సెంట్రల్ మండల ఇన్చార్జి కొత్తపల్లి అజయ్కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు గజేంద్ర తదితరులు పాల్గొన్నారు.