మామిడికి గిట్టుబాటు ధర కల్పిస్తాం
ABN , First Publish Date - 2021-06-23T06:04:48+05:30 IST
మామిడికి గిట్టుబాటు ధర కల్పించడానికి కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ ఏడీ ఇందుమతి తెలిపారు.
మార్కెటింగ్ శాఖ ఏడీ ఇందుమతి
బంగారుపాళ్యం, జూన్ 22: మామిడికి గిట్టుబాటు ధర కల్పించడానికి కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ ఏడీ ఇందుమతి తెలిపారు. మంగళవారం బంగారుపాళ్యం యార్డును తనిఖీ చేసి, ధరలపై ఆరా తీశారు. లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు రాకపోవడంతో మామిడి ధరలు ఆశాజనకంగా లేవన్నారు. అలాగే ఈ ఏడాది అధిక దిగుబడి రావడం వల్ల కూడా గిట్టుబాటు ధర దక్కలేదన్నారు. వ్యాపారులు, గుజ్జు పరిశ్రమ యజమానులతో చర్చించి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు. మార్కెట్ కమిటీ కార్యదర్శి గంగయ్య, తదితరులు పాల్గొన్నారు.