గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం

ABN , First Publish Date - 2021-10-23T04:05:59+05:30 IST

గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. గంజాయి వినియోగిస్తున్న, ఉత్పత్తి, రవాణాదారులపై క్రిమినల్‌ కేసులు, పీడీ యాక్టులు నమోదు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. శుక్రవారం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి రామగుండం కమిషనరేట్‌, కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీపీ చంద్రశేఖర్‌రెడ్డి

- వినియోగిస్తున్న వారిపై, ఉత్పత్తి, రవాణాదారులపై క్రిమినల్‌ కేసులు, పీడీ యాక్టులు

- కమిషనరేట్‌, కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల సమావేశంలో సీపీ చంద్రశేఖర్‌రెడ్డి

కోల్‌సిటీ, అక్టోబరు 22: గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. గంజాయి వినియోగిస్తున్న, ఉత్పత్తి, రవాణాదారులపై క్రిమినల్‌ కేసులు, పీడీ యాక్టులు నమోదు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. శుక్రవారం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి రామగుండం కమిషనరేట్‌, కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ అధికారులతో మాట్లాడుతూ మత్తు పదార్థాలు వినియోగిస్తున్న వారిపై, సరఫరా, ఉత్పత్తి చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. యువత వాటికి దూరంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అవలంభించాల్సిన విధివిఽదానలపై అధికారులకు సూచనలు చేశారు.

పెద్దపల్లి, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలను గంజాయి రహిత జిల్లాలుగా మార్చేందుకు పోలీసులు సంసిద్ధులై ఉండాలని అన్నారు. ఎవరైనా గంజాయి, మత్తు పదార్థాలు వినియోగించినా, ఉత్పత్తి, రవాణా చేసినా వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు. కఠినంగా వ్యవహరించాలని, పీడీయాక్టు అమలు చేయాలని ఆదేశించారు. యువత గంజాయి, డ్రగ్స్‌తో గ్యాంబ్లింగ్‌ వంటి వ్యసనాలతో మానసికంగా, శారీరకంగా నష్టపోవడమే కాకుండా విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్నారన్నారు. గంజాయి సరఫరా, ఉత్పత్తి, సాగు చేసే ఎవరికైనా పోలీస్‌ అఽధికారులు, సిబ్బంది సహకరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. హోమ్‌ గార్డు నుంచి ఉన్నతాధికారి వరకు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి సరైన నిఘా ఉంచాలని అన్నారు. మారుమూల ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలను ఉపయోగించి గంజాయి పండిస్తున్న ప్రాంతాలను గుర్తించాలని అన్నారు. 

అసైన్డ్‌ భూముల్లో గంజాయి మొక్కలు దొరికితే ఆ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. పట్టా భూముల్లో గంజాయి పండిస్తే రైతుబంధు రాకుండా చేస్తామన్నారు. గంజాయిని సమూలంగా అరికట్టేందుకు ప్రత్యేక టీములు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. గంజాయి వినియోగిస్తున్న, ఉత్పత్తి, రవాణా చేస్తున్నా బాధ్యతగా భావించి పోలీసులకు సమచారం అందించాలని అన్నారు. వారి వివరాలు గోప్యంగా ఉంచ డంతో పాటు రివార్డు అందజేస్తామని పేర్కొన్నారు. గంజాయిని అరికట్టడంలో కృషి చేసిన పోలీస్‌ అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక రివార్డులను అందజేయనున్నట్టు పేర్కొన్నారు. 

వీడియో కాన్ఫరెన్స్‌లో డీసీపీ(అడ్మిన్‌) అశోక్‌కుమార్‌, కొమురంభీం ఆసిఫాబాద్‌ అడ్మిన్‌ ఎస్‌పీ వైవీఎస్‌ సుదీంద్ర, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ నారాయణ, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ కమలాకర్‌, రామ గుండం కమిషనరేట్‌, కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాల్లో డీసీపీ, ఏసీపీలు, డీఎస్పీలు, సీఐలు, టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-23T04:05:59+05:30 IST