విపత్కాలంలో ప్రజలకు అండగా ఉండాలి
ABN , First Publish Date - 2021-06-18T06:31:45+05:30 IST
కొవిడ్ కష్ట కాలంలో ప్రజలకు అండగా ఉండి తగిన సా యం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని విద్యుత్శాఖ మంత్రి బాలినేని శ్రీనివా సరెడ్డి పిలుపునిచ్చారు.
మంత్రి బాలినేని పిలుపు
ఒంగోలు(కలెక్టరేట్), జూన్ 17: కొవిడ్ కష్ట కాలంలో ప్రజలకు అండగా ఉండి తగిన సా యం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని విద్యుత్శాఖ మంత్రి బాలినేని శ్రీనివా సరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక లాయర్పేటలోని మంత్రి నివాసంలో గురువారం లయన్స్ క్లబ్ ఇం టర్నేషనల్ సంస్థ రూ.15 లక్షల విలువైన 12 ఆ క్సిజన్ కాన్సన్ట్రేటర్లు మంత్రి బాలినేనికి అందజే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క రోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుందన్నారు. కొవిడ్ మూడ వ దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలందరూ ముందస్తుగా వ్యాక్సిన్ వే యించుకోవాలని కోరారు. జిల్లాలోని అన్ని ప్రభు త్వ వైద్యశాలల్లో ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటుకు చ ర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం బా పూజీకాంప్లెక్స్లో రూ.29లక్షలతో నిర్మించిన తారు రోడ్డును మంత్రి బాలినేని ప్రారంభించారు. ఆ యా కార్యక్రమాల్లో నగర మేయర్ గంగాడ సు జాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారా యణ, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ చైర్మన్ విజయ్కుమార్రెడ్డి, గ్రానెట్ ఓనర్స్ అసోసియేష న్ సభ్యులు మారం వెంకారెడ్డి, చలువాది బదరీ నారాయణ, రావిపూటి లక్ష్మీనారాయణ, కాంప్లెక్స్ కమిటీ అధక్షుడు కోడూరి సత్యనారాయణ, కార్య దర్శి శ్రీనివాసరావు, బియ్యపు వరదరాజు, వైసీపీ నాయకులు సింగరాజు వెంకట్రావు, కటారి శంక ర్ తదితరులు పాల్గొన్నారు.