గిరిజన రైతు కుటుంబాలను ఆదుకుంటాం

ABN , First Publish Date - 2022-07-17T05:55:13+05:30 IST

వర్షాలతో అటవీ ప్రాంతంలో మృతి చెందిన ఆవులకు సంబంధించిన పాడి రైతుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామాని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.

గిరిజన రైతు కుటుంబాలను ఆదుకుంటాం
గిరిజన రైతులను పరామర్శిస్తున్న తోట ఆగయ్య

రుద్రంగి, జూలై 16: వర్షాలతో అటవీ ప్రాంతంలో మృతి చెందిన ఆవులకు సంబంధించిన పాడి రైతుల  కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామాని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. రుద్రంగి మండలం దెగవాత్‌ తండా శివారులోని సూరమ్మ అటవీ ప్రాంతంలో చనిపోయిన ఆవులను శనివారం మండల ఆధికారులు, ప్రజాప్రతినిధులత కలిసి పరిశీలించారు. వివరాలను కలెక్టర్‌ అనురాగ్‌ జయంతికి నివేదించనున్నట్లు తహసీల్దార్‌ భాస్కర్‌ తెలిపారు.  అనంతరం   తోట ఆగయ్య మాట్లాడుతూ  విషయాన్ని మంత్రులు కేటీఆర్‌,  ప్రశాంత్‌రెడ్డి దృష్టి తీసుకెళ్లామని,  ప్రభుత్వం తరుపున  ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు.  సీఐ శ్రీలత, ఎంపీపీ గంగం స్వరూపరాణి మహేష్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దెగవాత్‌ తిరుపతి, వైస్‌ ఎంపీపీ పిసరి చిన్న భూమయ్య, మాజీ వైస్‌ ఎంపీపీ బాదనవేణి రాజరాం, ఎస్సై విజయ్‌ కూమార్‌, మండల పశువైద్యాధికారి శైలజ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-17T05:55:13+05:30 IST