గిరిజన రైతులను ఆదుకుంటాం
ABN , First Publish Date - 2020-05-30T09:49:53+05:30 IST
నియోజకవర్గ గిరిజన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు.
ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
బుట్టాయగూడెం, మే 29: నియోజకవర్గ గిరిజన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. కేఆర్పురం ఐటీడీపీ కార్యాలయం ఆవ రణలో శుక్రవారం 50 మంది గిరిజన రైతులకు సుమారు రూ. 6 లక్షల విలువైన 30 ఆయిల్ ఇంజన్లు, 20 స్ర్పేయర్లను ఐటీడీఏ పీవో సూర్యనారాయణతో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.