మైనార్టీలు అన్ని కులమతాలతో మమేకం కావాలి
ABN , First Publish Date - 2021-01-18T06:24:03+05:30 IST
ముస్లింలు అన్ని కులమతాలతో మమేకం కావాలని మైనార్టీ కమిషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ అబిద్ రసూల్ఖాన్ అన్నారు.
మైనార్టీ కమిషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ అబిద్ రసూల్ఖాన్
నాగార్జున సాగర్, జనవరి 17 : ముస్లింలు అన్ని కులమతాలతో మమేకం కావాలని మైనార్టీ కమిషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ అబిద్ రసూల్ఖాన్ అన్నారు. ఆదివారం ఆయన సాగర్కు వచ్చిన ఐదు మండలాలకు చెందిన ముస్లిం ప్రజాప్రతినిధులతో స్థానిక విజయ విహార్లో సమావేశమాయ్యరు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్, అలీనగర్ చెక్పోస్టు, అరబ్బీ మదర్సాల వంటి మసీదుల ఇమామ్ల, మౌజన్లకు గౌరవ వేతనం ఇవ్వాలని ముస్లింలు ఆయన్ని కోరారు. అదేవిధంగా ఈద్గాలు, మసీదులకు వెళ్లే రోడ్లకు మరమ్మతుల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించాలని కోరారు. సమావేశంలో మహ్మద్ బద్రుద్దీన్, సెక్రటరీ సుభాని, అన్వరుద్దీన్, బషీర్, అహ్మద్, షఫీ పాల్గొన్నారు.